కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ (Ebola) అనుమానిత కేసులు ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించాయి. ఎబోలా తరహా ప్రాథమిక లక్షణాలతో నగరంలోని అపోలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులను వైద్యాధికారులు రాత్రికి రాత్రే సికింద్రాబాద్లోని ప్రభుత్వ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ రెండు ఎబోలా అనుమానిత కేసులకు సంబంధించి గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. నగరంలో ఎబోలా లక్షణాల వార్త బయటకు రావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

