epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జీ20లో దక్షిణాఫ్రికాకు స్థానం లేదు: ట్రంప్

వచ్చే ఏడాది అమెరికాలోని మియామీలో జరగనున్న జీ20 సదస్సు(G20 Summit)లో దక్షిణాఫ్రికా పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించారు. మానవహక్కుల హననం, ముఖ్యంగా తెల్లవాళ్లపై దాడులు అరికట్టడంలో ఆ దేశం విఫలమైందని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దక్షిణాఫ్రికాకు తాము అందిస్తున్న ఆర్థిక సాయం, రాయితీలు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

‘‘దక్షిణాఫ్రికా(South Africa)లో వలసదారులు, ముఖ్యంగా డచ్, ఫ్రెంచ్, జర్మన్ సెటిలర్స్ ను చంపుతున్నారు. వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వీటి కారణంగానే ఆ దేశంలో జరిగిన గత జీ20 సదస్సుకు అమెరికా హాజరుకాలేదు. అయితే, వాటిపై వివరణ కోరుతూ సమావేశం చివరిరోజు హాజరైన మా ప్రతినిధికి దక్షిణాఫ్రికా సరైన వివరణ ఇవ్వలేదు. ఈ చర్యల వల్ల తమకు జీ20 సభ్యదేశంగా అర్హత లేదని ప్రపంచానికి దక్షిణాఫ్రికా చాటుతున్నట్లు కనిపిస్తోంది. అందువల్లే, 2026లో అమెరికాలోని మియామీలో జరగనున్న జీ20 సదస్సుకు దక్షిణాఫ్రికాకు ఆహ్వానం పంపకూడదని నిర్ణయించాం. అంతేకాదు, ఆ దేశానికి యూఎస్ఏ అందిస్తున్న అన్నిరకాల ఆర్థిక సాయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నాం.’’ అని ట్రంప్(Donald Trump) ప్రకటించారు. కాగా, జీ20 సదస్సులో పాల్గొనకుండా నిషేధం విధించడం మీద దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా విచారం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం కారణంగానే ఇలా జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు.

Read Also: మెడికల్ కాలేజీల అనుమతుల్లో గోల్‌మాల్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>