కలం, డెస్క్ : తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ (Congress) పార్టీ ఖరారు చేసింది. మాజీ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో పాటు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్లను కేటాయించింది. ఏఐసీసీ కోటాలో అభిషేక్ సింఘ్వీకి, తెలంగాణ కాంగ్రెస్ (Congress) కోటాలో వేం నరేందర్ కు ఛాన్స్ దక్కింది. వీరిద్దరూ రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయబోతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

