కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో క్రైమ్ బ్రాంచ్ ఆర్కే పురం బృందం జరిపిన మెరుపు దాడిలో హిమాంశు భౌ గ్యాంగ్ (Himanshu Bhau Gang)కు చెందిన ఇద్దరు షూటర్లు పట్టుబడ్డారు. బక్కర్వాలా ప్రాంతంలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు షూటర్లు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో షూటర్లు ప్రయాణిస్తున్న మహీంద్రా థార్ వాహనం ఒక పిక్-అప్ వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. అనంతరం పోలీసులపైకి కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు.

