కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ (CV Anand) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ 30తో కంప్లీట్ అవ్వనుంది. ఆయన స్థానంలో ఫుల్ టైమ్ డీజీపీగా సీవీ ఆనంద్ పేరును ప్రభుత్వం ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగబోతున్నారు. సీవీ ఆనంద్ 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లా ఎస్పీగా సేవలు అందించారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, సైబర్ నేరాలను అరికట్టడంలో సీవీ ఆనంద్ దిట్ట.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On : WhatsApp

