కలం, డెస్క్ : మున్సిపల్ (Municipal Elections) ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో సాగుతోంది. ఇప్పటి వరకు 52 మున్సిపల్ వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ ఎస్ పార్టీ 20, బీజేపీ 11 గెలవగా.. ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అడ్డంకులు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.


