కలం, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల వేళ మహబూబాబాద్ (Mahabubabad) పట్టణంలో ఉద్రికత్త నెలకొంది. 14వ వార్డులో 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువురి కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వార్డులో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


