కలం, వెబ్డెస్క్: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని శంకరపల్లి మండలంలో మహాలింగాపురం వద్ద సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్లు కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన 11 మంది కార్మికులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వీరికి నష్ట పరిహారం () చెల్లించేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అంగీకరించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.

