కలం, వెబ్ డెస్క్ : తల తాకట్టు పెట్టయినా ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం అసిఫాబాద్ మండలం కొఠారి కొత్త గూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. అలాగే, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 112.4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏ గూడెలో కూడా గుడిసె ఉండకూడదన్నారు. నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆదివాసీల కోసం 21 వేల ఇళ్లను అదనంగా ఇస్తామని సీఎం ప్రకటించారు.

