epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఢిల్లీలో సోనియా గాంధీని క‌లిసిన సీఎం రేవంత్ రెడ్డి

క‌లం వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi)ని క‌లిశారు. సోనియా గాంధీ నివాసంలో ఆమెను క‌లిసి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ (Telangana Rising Vision 2047 Document) అంద‌జేశారు. ఇటీవ‌ల రాష్ట్రంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Global Summit) నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన‌ వివరాలను రేవంత్ రెడ్డి, సోనియా గాంధీకి వివరించారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పాల‌న‌లో గ‌త రెండేళ్లుగా అమల‌వుతున్న‌ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్తు ప్రణాళికలను రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy )ని సోనియా అభినందించారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని సూచించారు.

Read Also: మహాత్మాగాంధీ పేరు తొలగించడం దుర్మార్గం: కాంగ్రెస్ నేతలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>