కలం, వెబ్ డెస్క్ : కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలపై ఆదివారం నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఆయన స్పందించారు. ’కేసీఆర్(KCR) ఇప్పటికైనా మారుతారని ఆశించాను. కానీ, ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. రాజకీయంగా భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అసత్యాలు ప్రచారం చేశారు. కేసీఆర్ కు అహంకారం తగ్గడం లేదు.. ఇప్పటికైనా అబద్ధాలు మానాలి. బీఆర్ఎస్(BRS) దోపిడి లెక్కలు మొత్తం బయటకు తీస్తా. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ నేత కేసు వేశాడు. కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. నీళ్లు, నిజానిజాలపై చర్చిద్దాం. అసెంబ్లీ వేదికగా ముఖాముఖి చర్చకు సిద్ధం‘ అంటూ రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు సవాల్ విసిరారు.
Read Also: కేసీఆర్ ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
Follow Us On: X(Twitter)


