గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క.. చివరకు..!

కలం, మెదక్ బ్యూరో : యువకుడి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ప్రాణాల మీదకు వచ్చిన ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో చోటుచేసుకుంది. కంగ్టి మండలం జీర్గి తండాకు చెందిన శివకుమార్(28) ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో అతడికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కావడంతో కుటుంబ సభ్యులు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్లు.. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం శివ పరిస్థితి విషమంగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>