Mobile Popup Ad
Mobile Popup Ad

చంద్రబాబు పల్నాడు పర్యటన: నేడే రైతుల ఖాతాల్లోకి నిధులు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 11:30 గంటలకు లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. ఈ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం భారీ లబ్ధి చేకూర్చనుంది.

పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి ఈ రోజు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మొత్తం రూ.3,125 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలో నేరుగా రూ.7 వేల చొప్పున నగదు జమ కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతు కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>