కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ వల్ల దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో (Delhi) కట్టెల పొయ్యిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. ఇక నుంచి హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంట చేసుకోవచ్చని చెప్పింది. ఇప్పటికే అనేక నగరాల్లో గ్యాస్ కు బదులు కట్టెల పొయ్యిని వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో (Delhi) గాలి కాలుష్యం కారణంగా గతంలో కట్టెల పొయ్యిని పూర్తిగా నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు గ్యాస్ కొరత పీక్స్ కు చేరుకోవడంతో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

