కలం, వరంగల్: భద్రకాళీ దేవస్థానం (Bhadrakali Temple) పరిధిలోని చెరబండ రాజు కాలనీలో శనివారం మున్సిపల్ అధికారులు గుడిసెలు తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ బాధితులు జేసీబీ లను అడ్డుకుని నిరసనకు దిగారు. కోర్టు స్టేటస్ కో ఉన్నప్పటికీ కూల్చివేయడం పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం మేరకు పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు

