కలం వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ (Bellamkonda Suresh) కుటుంబం నేడు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిసింది. బెల్లంకొండ సురేశ్ కొడుకు, హీరో శ్రీనివాస్ వివాహం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేశ్, ఆయన భార్య, ఇద్దరు కొడుకులు సీఎం రేవంత్ను పెళ్లికి రావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి బెల్లంకొండ శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలె శ్రీనివాస్కు కవ్యారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. తిరుపతిలో ఈ నెల 29న వీరి వివాహం జరుగనుంది. ఇప్పటికే శ్రీనివాస్ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. చిరంజీవి, నాగార్జునలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

