బంగ్లాదేశ్‌ జట్టులోకి లిట్టన్ రీ ఎంట్రీ.. పాక్‌తో పక్కా..!

క‌లం, వెబ్ డెస్క్‌: పాకిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) 15 మంది సభ్యులతో కూడిన ప‌వ‌ర్‌ఫుల్‌ జట్టును ప్రకటించింది. మార్చి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో అత్యంత కీలక పరిణామం ఏమిటంటే, స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ (Litton Das) తిరిగి వన్డే జట్టులోకి రావడం. గతంలో వరుసగా విఫలం కావడంతో జట్టుకు దూరమైన లిట్టన్, ఇప్పుడు మిడిలార్డర్‌ను బలోపేతం చేసే బాధ్యతతో మళ్ళీ బరిలోకి దిగుతున్నారు.

బంగ్లాదేశ్ సెలెక్షన్ కమిటీ (BCB) గత వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని జట్టులో పలు మార్పులు చేసింది. జట్టులో ఇబ్బందిగా మారిన మిడిలార్డర్ సమస్యను పరిష్కరించడానికి అనుభవజ్ఞుడైన అఫీఫ్ హుస్సేన్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అఫీఫ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారని, అతని అనుభవం జట్టుకు ఎంతో అవసరమని చీఫ్ సెలెక్టర్ గాజీ అష్రఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. అలాగే యువ ఆటగాడు మహిదుల్ ఇస్లాం భుయాన్‌కు తన ప్రతిభను నిరూపించుకోవడానికి మరో అవకాశం కల్పించారు.

లిట్టన్ దాస్ ఎంపిక గురించి సెలెక్టర్లు స్పందిస్తూ, అతను వన్డేల్లో వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడని తెలిపారు. కోచ్‌ల పర్యవేక్షణలో తన ఆటను మెరుగుపరుచుకున్న లిట్టన్, త్వరలోనే మునుపటి ఫామ్‌ను అందుకుంటాడని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సౌమ్య సర్కార్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశమని వారు వెల్లడించారు. బౌలింగ్ విభాగంలో నహిద్ రాణా, షోరిఫుల్ ఇస్లాంలకు చోటు దక్కింది.

బంగ్లాదేశ్ వన్డే జట్టు:

మెహిదీ హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, అఫీఫ్ హుస్సేన్, మహిదుల్ ఇస్లాం భుయాన్, రిషాద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, నహిద్ రాణా.

Read Also: కర్ణాటకలో రోహిత్​ వేముల చట్టం : సీఎం సిద్ధరామయ్య

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>