కలం, వెబ్ డెస్క్: ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం రోహిత్ వేముల చట్టం(Rohith Vemula) అమలు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కర్ణాటకలోని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్లో కుల వివక్ష అరికట్టడానికి రోహిత్ వేముల పేరుతో చట్టం తీసుకురావాలని సీఎం సిద్ధరామయ్యకు (Siddaramaiah) లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతేడాది సూచించారు. ఈ క్రమంలో గత నెల 26న రోహిత్ వేముల చట్టం ముసాయిదా బిల్లుపై కర్ణాటక విధానసభలో చర్చ జరిగింది. అనంతరం దీనికి కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపింది. వాళ్లు సూచించిన మార్పులు, చేర్పులతో కొత్త చట్టాన్ని కేబినెట్ ముందుకు తీసుకెళతారు. అనంతరం అసెంబ్లీ ఆమోదం తర్వాత చట్టం అమల్లోకి వస్తుంది.
కాగా, తెలంగాణకు చెందిన దళిత యువకుడు రోహిత్ వేముల (Rohith Vemula) ఓ విశ్వవిద్యాలయంలో చదువుతూ, కుల వివక్ష కారణంగా 2016లో ఆత్మహత్య చేసుకున్నారు.
Read Also: ప్రేమించి పెళ్లి చేసుకుంటే చితకబాదుతోంది.. భర్తని హింసిస్తున్న భార్య!
Follow Us On: Pinterest

