బీసీ బంద్(BC Bandh) పలు చోట్ల ఉద్రిక్తంగా మారుతోంది. బంద్ను కాదని తెరిచిన కొన్ని షాపులపై బీసీ సంఘాల నాయకులు దాడులు చేస్తున్నారు. యజమానులకు, పనిచేసే వారిని బెదిరించి షాపులు మూయిస్తున్నారు. హైదరాబాద్-నల్లకుంట పరిధిలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. బీసీ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న బజాజ్ షోరూమ్పై బీసీ సంఘాల నాయకులు రాళ్ల దాడులు చేశారు. అద్దాలను పగలుగొట్టి షోరూమ్ను మూయించారు. అదే విధ:గా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్పైన కూడా వారు దాడులు చేశారు. బలవంతంగా షాపులు మూయించారు. అదే ప్రాంతంలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్పైన కూడా బీసీ సంఘాల నేతలు దాడులకు పాల్పడ్డారు.
Read Also: బీసీ బంద్లో కింద పడిపోయిన కాంగ్రెస్ నేత..

