Mobile Popup Ad
Mobile Popup Ad

బంగ్లాదేశ్ క్రికెటర్ నయీమ్ హసన్‌పై దాడి ఆరోపణలు

క‌లం, వెబ్ డెస్క్‌: జింబాబ్వేతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన కొద్ది రోజులకే బంగ్లాదేశ్ స్పిన్నర్ నయీమ్ హసన్ (Nayeem Hasan) వివాదంలో నిలిచాడు. తన స్వస్థలం చిట్టగాంగ్‌లో చట్ట అమలు సంస్థ సభ్యులు తనపై వేధింపులకు, దాడికి పాల్పడ్డారని అతడు ఆరోపించాడు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు నయీమ్ తెలిపాడు. ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ తరఫున ప్రీమియర్ లీగ్‌లో చివరి మ్యాచ్ ఆడి విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్తుండగా తన వాహనాన్ని పోలీసులు ఆపినట్లు చెప్పాడు.

రాత్రి 11:25 గంటల సమయంలో లంకన్ బజార్ ఫ్లైఓవర్ వద్ద డ్రైవర్ నుంచి పత్రాలు తీసుకున్నారని పేర్కొన్నాడు. అవసరమైతే తన బ్యాగ్ కూడా తనిఖీ చేయొచ్చని చెప్పినా, తనను బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారని ఆరోపించాడు. అక్కడితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని నయీమ్ తెలిపాడు. కారణం అడగగా తనను తోసివేసి, కొట్టడంతో పాటు దుర్భాషలాడినట్లు పేర్కొన్నాడు. తాను జాతీయ జట్టు క్రికెటర్‌నని, దేశానికి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నానని చెప్పినా మొదట ఎవరూ పట్టించుకోలేదని తెలిపాడు.

తర్వాత తన గురించి సమాచారం అందిన తర్వాతే అధికారుల వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించాడు. ఈ ఘటన బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జింబాబ్వేతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా, చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ ఉత్తర విభాగం డిప్యూటీ కమిషనర్ అమీరుల్ ఇస్లాం స్పందించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తప్పవని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>