ఏపీ లిక్కర్​ స్కామ్​.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్​

కలం, వెబ్​ డెస్క్​: ఆంధ్రప్రదేశ్​లో లిక్కర్​ స్కామ్(AP Liquor Scam)​ నిందితులకు ఈడీ షాక్ ఇచ్చింది. నిందితులకు చెందిన రూ.441కోట్ల విలువైన ఆస్తులను అటాచ్​ చేసింది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన కెసిరెడ్డి రాజశేఖర్​ రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డికి ఈ ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అటాచ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో.. 2019లో లిక్కర్​ పాలసీలో మార్పులు జరిగి, రూ.4వేల కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. పాలసీ మార్పుల్లో ప్రధానంగా పాత మద్యం బ్రాండ్లను మార్కెట్​ నుంచి తొలగించి, తమకు అనుకూలమైన బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తించింది. అలాగే, ప్రతి లిక్కర్​ బాటిల్స్​ కేస్​పై 15 నుంచి 20 శాతం వరకు కిక్​ బ్యాక్​ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమిషన్​ ఇవ్వని కంపెనీలకు మద్యం ఆర్డర్లు ఇవ్వలేదని కూడా గుర్తించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో(AP Liquor Scam) ప్రస్తుతం ఈడీ దూకుడు పెంచింది. త్వరలో మరిన్ని అరెస్టులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>