కలం, వెబ్ డెస్క్: ఏపీలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన రూ.258 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మొత్తాన్ని విద్యాసంస్థల అకౌంట్లలో జమ చేసింది. విడతల వారీగా ప్రభుత్వం రూ.4వేల కోట్లకు పైగా బకాయిలను చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి నెలలోనూ దాదాపు రూ.1,200 కోట్లను రిలీజ్ చేసింది. గతంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తుండగా, ఈ విద్యాసంవత్సరం నుంచి కాలేజీల అకౌంట్లలోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వేస్తున్నారు.

