మార్చి 7 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన పీఏసీ స‌మావేశం ముగిసింది. మార్చి 7 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు (AP Assembly Sessions )  నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. మార్చి 5, 6, 7వ తేదీల్లో ఎమ్మెల్యేల‌కు ఆట‌ల‌పోటీలు నిర్వహించ‌నున్నారు. ఈ నెల 14న ఏపీ ప్ర‌భుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వ్య‌వ‌సాయం, వైద్యం, విద్య‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్నారు. స‌మావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. స‌మావేశానికి సీఎం చంద్ర‌బాబు స‌హా ప‌లువురు మంత్రులు హాజ‌ర‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>