కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల (AP 10th Results)ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ఏడాది సుమారు 6 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను వేగంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అధికారిక వెబ్సైట్తో పాటు వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. లీప్ యాప్, మన మిత్ర ప్లాట్ఫారమ్లలో మార్కుల వివరాలను చూసుకునే వెసులుబాటు కల్పించారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వెలువడుతున్న ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

