కలం, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం(Vetlapalem)లో జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం దర్శిపెట్టి లావరాజు అనే వ్యక్తి తుది శ్వాస విడిచాడు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరుకుంది. లావరాజు సామర్లకోటలోని బ్రౌన్పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పేలుడు ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

