కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంక్రాంతి సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. కేవలం వారం రోజుల్లోనే రూ.877 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. జనవరి 9 నుంచి 16 దాకా ఈ అమ్మకాలు జరిగినట్టు అధికారులు వివరించారు. సాధారణ రోజుల్లో ఏపీ వ్యాప్తంగా రూ.85 కోట్ల అమ్మకాలు ప్రతిరోజూ జరిగేవి. కానీ సంక్రాంతి సందర్భంగా ఈ అమ్మకాలు డబుల్ అయ్యాయని ఆఫీసర్లు చెబుతున్నారు. పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జోరుగా మద్యం అమ్మకాలు (Liquor Sales) జరిగినట్టు అధికారులు వివరించారు. ఈ సారి అమ్మకాలు గతంలో కంటే చాలా ఎక్కువగా జరిగినట్టు చెబుతున్నారు ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు.
Read Also: అమ్ముడుపోయిన వాళ్ల మధ్య ఉంటే అంతే సంగతి.. విజయసాయిరెడ్డి
Follow Us On: X(Twitter)


