త్వరగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి: మెదక్ కలెక్టర్

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణాలకు 5201గాను 111 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రతివారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల బిల్లులను చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>