కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని వాజ్పేయ్ శతజయంతి ఉత్సవాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించిందన్నారు. ప్రతీ జిల్లాలో వాజ్పేయ్ (Atal Bihari Vajpayee) విగ్రహాలు పెట్టడం అద్భతమని బండి సంజయ్ కొనియాడారు. తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చాకా ఇలానే చెస్తామన్నారు.
కూటమి(NDA) ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నదని, ఏపీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో కూడా తాము అధికారంలోకి వస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ను కూకటివేళ్లతో పెకిలించి బంగాళఖాతంలో కలిపినట్లే తెలంగాణలోనూ ఆ పార్టీని బొంద పెడుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బోర్లా పడిందని, ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నదని ఆయన విమర్శించారు.
కేసీఆర్ పాలనతో విసిగిన ప్రజలు కన్ఫ్యూజన్ లో కాంగ్స్రెస్కు ఓటు వేశారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దీనివల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ నిధులే అందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని బండి సంజయ్ (Bandi Sanjay) వెల్లడించారు.
Read Also: గ్రామీణ ఉపాధిపై మోడీ బుల్డోజర్లు : సోనియా
Follow Us On: Youtube


