Mobile Popup Ad
Mobile Popup Ad

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం: అనంతనాగ్‌లో భారీ భద్రత

కలం, వెబ్ డెస్క్ : హిందువుల అత్యంత పవిత్రమైన వార్షిక అమర్‌నాథ్‌ క్షేత్ర దర్శన యాత్ర (Amarnath Yatra) నేటి నుంచి వైభవంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్‌లోని మంచులింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు నెల రోజుల ముందు నుంచే క్షేత్రస్థాయిలో విస్తృతమైన సన్నాహాలు చేపట్టారు. ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన యంత్రాంగం, అనంతనాగ్‌ జిల్లా అంతటా హైఅలర్ట్ ప్రకటించి నిఘాను ముమ్మరం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, యాత్ర అత్యంత ప్రశాంతంగా, శాంతియుతంగా సాగేలా భద్రతా బలగాలు ముందస్తు వ్యూహంతో పక్కా ప్లాన్ రూపొందించాయి. మారుమూల మార్గాలు, బేస్ క్యాంపుల వద్ద అదనపు బలగాలను మోహరించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>