Mobile Popup Ad
Mobile Popup Ad

అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సం.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్

కలం, వెబ్ డెస్క్ : అల్లూరి జిల్లా పాడేరు (Paderu) ఏజెన్సీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపిలేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ వైర్లు, చెట్లు కూలిపోతున్నాయి. పెదబయలు మండలం కీముడుపల్లి లో ఓ ఇంటి పై భారీ వృక్షం కూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.

మరోవైపు పాడేరు మండలం బూరుగు చెట్టు గ్రామం వద్ద విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. నిన్నటి నుంచి పది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓ వైపు భారీ వర్షం, మరోవైపు విద్యుత్ లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పెదబాయలు మండలం రాయిమామిడి దగ్గరి వాగు ఉప్పొంగి ప్రవాహిస్తోంది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>