epaper
Friday, March 6, 2026
epaper

దొంగతనానికి వచ్చి నిద్రపోయిన దొంగ

కలం, నిజామాబాద్ బ్యూరో : దొంగతనానికి వచ్చిన ఓ దొంగ అదే ఇంట్లో నిద్రపోయి దొరికిపోయాడు. కామారెడ్డి (Kamareddy) జిల్లా బీర్కూర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. బీర్కూర్‌ (Birkur) లో మాలి పటేల్‌కు రెండు ఇళ్లు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం పాత ఇంటికి దగ్గరే కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పాత ఇంటికి తాళం వేసి కొత్త ఇంట్లో ఉంటున్నారు.

ఓ దొంగ పాత ఇంటి వెనుక గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న వస్తువులను మూట గట్టాడు. మద్యం సేవించి ఉండడంతో నిద్ర వచ్చి.. దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే నిద్రపోయాడు. ఇంటి యజమానురాలు పాత ఇంట్లోకి వచ్చారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగానే ఒక వ్యక్తి పడుకుని ఉండటం గమనించింది. వెంటనే కేకలు వేస్తూ బయటకు రాగా చుట్టుపక్కల వారు అందరూ వచ్చి దొంగను పట్టుకున్నారు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు.

Read Also: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి: మొగలి సునీతా రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!