కలం, వరంగల్ బ్యూరో : ఎంతో భవిష్యత్ ఉన్న యువత నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న తీరుపై కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి (ACP Prashanth Reddy) చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆలోచింపజేస్తోంది. శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన మద్యం, గంజాయి లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘స్నేహితుడి మరణం మీలో మార్పు తేవాలి. వ్యసనాలకు ప్రేరేపించే స్నేహాన్ని వదులుకోండి’ అంటూ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: రోహింగ్యాల ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం కీలక ఆదేశాలు
Follow Us On: Youtube

