కలం, వెబ్డెస్క్: యువ భారత్ అదరగొట్టింది. అండర్–19 వన్డే ఆసియా కప్లో ఫైనల్ (India VS Pakistan) కు చేరింది. శుక్రవారం దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది తుదిపోరుకు చేరింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. చమిక హేనతిగల(42; 38 బంతుల్లో 3 ఫోర్లు) ఆ జట్టులో టాప్ స్కోరర్. విమత్ దిన్సార(32; 29 బంతుల్లో 4 ఫోర్లు), సెత్మిక సెనెవిరత్నె(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేశారు.
అనంతరం 139 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన యువ భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి జయకేతనం ఎగరవేసింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే(7), వైభవ్ సూర్యవంశీ(9) త్వరగానే వెనుదిరిగినా అరోన్ జార్జ్(58 నాటౌట్; 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), విహాన్ మల్హోత్రా (61 నౌటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత్ కోల్పోయిన రెండు వికెట్లూ రసిత్ నింసరా ఖాతాలో చేరాయి. శుక్రవారమే జరిగిన మరో సెమీస్లో పాక్ జట్టు 8 వికెట్ల తేడాతో బంగ్లా యువజట్టుపై గెలిచింది. బంగ్లాదేశ్ 26.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ కాగా, లక్ష్యాన్ని పాక్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫైనల్ (India VS Pakistan) ఆదివారం జరుగుతుంది.
Read Also: కాంగ్రెస్ ఏఐ వీడియో వివాదం.. గుజరాత్ కోర్టు కీలక ఆదేశాలు
Follow Us On: X(Twitter)


