కరీంనగర్ డీఆర్వోగా బాధ్యతల స్వీకరణ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా జె.స్వామి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న స్వామికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే డీఆర్వోగా పదోన్నతి కల్పించి కరీంనగర్ జిల్లాకు బదిలీ చేసింది. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన డీఆర్వోను కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు కలిసి అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>