U-18 ఆసియా కప్ హాకీ: మలేషియాపై భారత్ విజయం

కలం, వెబ్ డెస్క్ : యూ-18 మహిళల హాకీ ఆసియా కప్ (U18 Hockey Asia Cup)  2026 టోర్నీలో భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన పూల్-ఏ తొలి మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో మలేషియాపై గెలిచి టోర్నీని విజయంతో ప్రారంభించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత అమ్మాయిలు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. మ్యాచ్ ప్రారంభమైన మొదటి క్వార్టర్‌లో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ ఎక్కువ సమయం బంతిని తన ఆధీనంలో ఉంచుకుని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై వరుస దాడులు చేసింది. అయినప్పటికీ మలేషియా డిఫెండర్లు గట్టిగా అడ్డుకోవడంతో మొదటి 15 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

రెండో క్వార్టర్‌లో భారత జట్టు తన పట్టుదలను ప్రదర్శించింది. ఆట 19వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని భారత్ చక్కగా ఉపయోగించుకుంది. 15 ఏళ్ల యువ ఫార్వర్డ్ ప్లేయర్ నౌషీన్ నాజ్ లభించిన అవకాశాన్ని గోల్‌గా మలిచి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో (U18 Hockey Asia Cup) రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి కారణమైన నౌషీన్ నాజ్ స్టార్‌గా నిలిచింది. ఆమె చేసిన అద్భుతమైన ఫినిషింగ్ వల్లనే భారత్‌కు పూర్తి పాయింట్లు దక్కాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత నౌషీన్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Read Also: ఎంపీఎల్ టీ20కి Bhopal Wolves జట్టు ఇదే..

Read Also: స్మార్ట్ ప్రెసిడెంట్స్​!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>