epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ముస్తాక్​ అలీ ట్రోఫీ విజేత జార్ఖండ్​

కలం, వెబ్​డెస్క్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీలో జార్ఖండ్ (Jharkhand) విజేతగా నిలిచింది. గురువారం పుణే వేదికగా జరిగిన ఫైనల్​లో 69 పరుగుల తేడాతో హర్యానాపై గెలిచి ఛాంపియన్​గా నిలిచింది. జార్ఖండ్​ ఈ కప్​ గెలుచుకోవడం ఇదే తొలిసారి. తుది పోరులో తొలుత బ్యాటింగ్​ చేసిన జార్ఖండ్​ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 262 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్​, ఓపెనర్​ ఇషాన్​ కిషన్​(101; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్​లు) సెంచరీ, వన్​డౌన్​లో కుమార్​ కుశాగ్ర (81; 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్​లు) వీరవీహారం చేశారు. ఆఖర్లో అనుకుల్​ రాయ్​(40 నాటౌట్​; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్​లు), రాబిన్​ మింజ్​(31 నాటౌట్​; 14 బంతుల్లో 3 సిక్స్​లు) మెరుపులు మెరిపించారు. హర్యానా బౌలర్లలో సుమిత్​ కుమార్​, అన్షుల్​ కాంభోజ్​, సమంత్​ జకర్​​ తలో వికెట్​ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్​లోనే ఓపెనర్​, కెప్టెన్​ అంకిత్​​, వన్​డౌన్​ బ్యాటర్​ ఆశిష్​ డకౌట్​ అయ్యారు. మరో ఓపెనర్​ అర్ష్​ రాణా 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో 36 పరుగులకే టాపార్డర్​ వికెట్లు చేజార్చుకున్న హర్యానా ఇన్నింగ్స్​ నెమ్మదిగా సాగింది. మిడిలార్డర్​లో యశ్​వర్ధన్​(53; 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్​లు), నిశాంత్​ సింధు (31; 15 బంతుల్లో 6 ఫోర్లు), సమాంత్​ జకర్​(38; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్​లు) ఆశలు కల్పించినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. చివరికి హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. జార్ఖండ్​ (Jharkhand) బౌలర్లలో సుశాంత్​ మిశ్రా, బాల్​ కృష్ణ చెరో 3 వికెట్లు తీయగా, అనుకుల్ రాయ్​, వికాస్​ సింగ్​ చెరో 2 వికెట్లు పంచుకున్నారు. ఇషాంత్​ కిషన్​కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​, అనుకుల్​ రాయ్​కి ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ లభించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>