రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌గా నాగర్తి చంద్రారెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో : రెడ్డి ఐక్య వేదిక (Reddy Ikya Vedika) తాత్కాలిక రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు రెడ్డి ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హోటల్ లో జరిగిన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో నూతన కమిటీ ఎంపిక జరిగింది.

ఐక్య వేదిక తాత్కాలిక రాష్ట్ర కన్వీనర్‌గా నాగర్తి చంద్ర రెడ్డి‌, రాష్ట్ర కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా సంధి తిరుపతి రెడ్డి, కో కన్వీనర్ గా ఎలిమినేటి సుమన్ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, నలివెల్లి కరుణాకర్ రెడ్డి, రామమ్మగారి బాగా రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకుట్లు సంతోష్ రెడ్డి తెలిపారు. గత కమిటీ రద్దయినందున దాని అనుగుణంగా జిల్లా కమిటీలు కూడా రద్దవుతాయని ఆయన వెల్లడించారు.

Read Also: చిన్నారుల మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్ట్ ఆందోళన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>