epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విశాఖ ఉక్కు తాత్కాలిక సీఎండీగా మనీష్​రాజ్​ ​

కలం, వెబ్​డెస్క్​: విశాఖ ఉక్కు(రాష్ట్రీయ ఇస్పాత్​ నిగమ్​ లిమిటెడ్​) తాత్కాలిక సీఎండీగా మనీష్​రాజ్​ గుప్తా(Manish Raj Gupta) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. వచ్చే జనవరి 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(సెయిల్​)లో డైరెక్టర్​(టెక్నికల్​, ప్రాజెక్ట్స్​, రా మెటీరియల్స్​)గా మనీష్​రాజ్​ పనిచేస్తున్నారు. దీనితోపాటు ఆయన విశాఖ ఉక్కు సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా, విశాఖ ఉక్కుకు శాశ్వత సీఎండీ పోస్టు 2024, నవంబర్​ 30 నుంచి ఖాళీగా ఉంది.

Read Also:  ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు !

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>