epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఆ పేపర్స్ సోనియా వద్దే ఉన్నాయి: కేంద్రం

కలం, వెబ్​డెస్క్​: భారత ప్రథమ ప్రధాన మంత్రి నెహ్రూకు సంబంధించిన విలువైన పేపర్లు, పత్రాలు (Nehru Papers) ప్రైమ్​ మినిస్టర్స్ మ్యూజియం అండ్​ లైబ్రరీ(పీఎంఎంఎల్​)లో కనిపించడం లేదని వచ్చిన వార్తలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఆ పేపర్లు సోనియా గాంధీ వద్దే ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం ‘ఎక్స్​’ వేదికగా వెల్లడించింది. అంతేకాదు, అవి దేశ వారసత్వ సంపదలో భాగమని, వాటిని తిరిగివ్వాలని కోరింది. కాగా, లోక్​సభలో బీజేపీ ఎంపీ సంబితా పాత్ర అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ సమాధానమిస్తూ నెహ్రూకు సంబంధించిన విలువైన పేపర్లు, పత్రాలు పీఎంఎంఎల్​లో లేవని, అవి సోనియా వద్ద ఉన్నాయని చెప్పడం కాంగ్రెస్​ సభ్యుల ఆగ్రహానికి గురైంది. దీనిపై సోనియా గాంధీకి బీజేపీ క్షమాపణ చెప్పాలని వాళ్లు డిమాండ్​ చేశారు. ఈ గొడవ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ క్లారిటీ ఇచ్చింది. పీఎంఎంఎల్​లోని నెహ్రూ పేపర్స్​ 2008లో సోనియా గాంధీ ప్రతినిధి ఎంవీ రజన్ తీసుకున్నారని, ఆ తర్వాత నుంచి అవి ఆమె వద్దనే ఉన్నాయని వెల్లడించింది. ఆ పత్రాలు దేశ విలువైన ఆస్తిలో భాగమైనందున వాటిని తిరిగి ఇవ్వాలని తాము పలుసార్లు లేఖలు రాశామని, ఈ ఏడాది జనవరి, జులైలోనూ లేఖలు పంపామని వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>