epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మార్చిలోపు మెట్రో అప్పగించాలి: తెలంగాణ సీఎస్​​

కలం, వెబ్​డెస్క్​: వచ్చే ఏడాది మార్చి చివరికల్లా హైదరాబాద్​ మెట్రో (Hyderabad Metro) ను ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(CS Ramakrishna Rao) అధికారులకు స్పష్టం చేశారు. బదిలీ ప్రక్రియను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సజావుగా, గడువులోగా పూర్తి చేయాలన్నారు. మంగళవారం ఎల్​అండ్​టీ కీలక సిబ్బంది, ప్రభుత్వాధికారులతో సీఎస్​ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బదిలీ ప్రక్రియ ప్రస్తుత ఒప్పందాలకు ఎలాంటి అవాంతరం కలిగించకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. మెట్రోను ప్రభుత్వానికి స్వాధీనం చేసే ప్రక్రియను 100 రోజుల్లో అప్పగించేలా ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు.

ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఐడీబీఐ తుది నివేదికను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. బదిలీకి పూర్తిగా సహకరించాలని ఎల్​అండ్​టీని కోరారు. ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాక మెట్రో(Metro) కార్యకలాపాలు, నిర్వహణపై తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని మెట్రోరైల్​ ఎండీ సర్ఫరాజ్​ అహ్మద్​ను ఆదేశించారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి హైదరాబాద్​లో 69.2 కిలోమీటర్ల మేర మెట్రో రైల్​ వ్యవస్థను ఎల్​అండ్​టీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నిర్వహణ లోపాలు, బ్యాంకుల్లో రుణాల ఒత్తిడి కారణాలుగా చూపుతూ మెట్రోను ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఎల్​అండ్​టీ ఒప్పందం కుదుర్చుకుంది.

Read Also: ఈ ఏడాది ‘అలెక్సా’ని ఎక్కువగా అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>