epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టీడీపీ ఏపీ జిల్లా అధ్యక్షులు ఖరారు?

కలం, వెబ్​డెస్క్​: ఆంధ్రప్రదేశ్​లో అధికార తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల(TDP District Presidents) ను ఖరారు చేసినట్లు సమాచారం. చట్టసభలకు ఎన్నిక కానివాళ్లు, నామినేటెడ్​ పోస్టులు దక్కనివాళ్లు ఈ పదవులకు పోటీ పడ్డారు. ఒక్కో జిల్లా నుంచి ఒకటి కంటే ఎక్కువ మంది ఆశావహులు ఉండడంతో పార్టీ త్రీమెన్​ కమిటీని నియమించింది. ఈ కమిటీ జిల్లాల్లో పర్యటించి సీనియర్లు, స్థానిక నేతలు, ద్వితీయశ్రేణి నాయకులు అభిప్రాయం తీసుకొని పార్టీ అధ్యక్షుడికి అందించింది. అనంతరం ఈ జాబితా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)కు చేరడంతో ఆయన తుది జాబితాను ఎంపికచేసినట్లు తెలిసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం 13 జిల్లాలకు అధ్యక్షులు ఖరారయ్యారు. ఇందులో తిరుపతి జిల్లాకు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి సారథిగా ఎంపికవగా, అనంతపురం–కాల్వ శ్రీనివాసులు, సత్యసాయి–ఎంఎస్​ రాజు, ప్రకాశం–ఉగ్ర నరసింహారెడ్డి, పల్నాడు–కొమ్మాలపాటి శ్రీధర్, ఏలూరు–బడేటి చంటి, చిత్తూరు–షణ్ముగం, అన్నమయ్య–సుగవాసి ప్రసాద్, ​నంద్యాల–ధర్మవరపు సుబ్బారెడ్డి, విజయనగరం–కిమిడి నాగార్జున, కాకినాడ–జ్యోతుల నవీన్, ​బాపట్ల–సలగల రాజశేఖర్​, ఎస్​పీఎస్​ఆర్​ నెల్లూరు–రేచర్ల వెంకటేశ్వరరావు జిల్లా అధ్యక్షులుగా(TDP District Presidents) ఎంపికైనట్లు తెలుస్తోంది.

Read Also: జగన్ కోర్టులను లెక్క చేయడు.. చంద్రబాబు ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>