కలం, వెబ్డెస్క్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసన (Congress Protest)కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాల్సిందిగా ఏఐసీసీ పిలుపునిచ్చింది. అలాగే ఈ పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అయిన డిసెంబర్ 28న కూడా ఇదే తరహాలో భారీగా పార్టీ కేడర్, ప్రజలను కలుపుకొని నిరసన, ఆందోళను చేపట్టాలని శ్రేణులకు సూచించింది. ఈ ఆందోళనలు, నిరసనల్లో గాంధీజీ విగ్రహాలకు పాలాభిషేకం, పూలమాలు వేయాలని, వినతి పత్రాలు అందించాలని, గాంధీజీ చిత్రపటాలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది.
Read Also: ‘ఛాంపియన్’ కోసం రంగంలోకి రామ్ చరణ్
Follow Us On: X(Twitter)


