epaper
Friday, January 16, 2026
spot_img
epaper

వీసా సర్వీసు ఫీజు పెంచిన న్యూజిలాండ్​

కలం, వెబ్​డెస్క్​: భారత్​ సహా మరో 25 దేశాల్లో వీసా (New Zealand Visa) సర్వీస్​ ఫీజును న్యూజిలాండ్​ పెంచింది. వీసా అప్లికేషన్​ సెంటర్స్​(వీఏసీఎస్​)లు ఈ మేరకు అదనపు చార్జీలు వసూలు చేస్తాయి. పెంచిన ధరలు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా సర్వీస్​ ఫీజును పెంచినట్లు న్యూజిలాండ్​ ఇమ్మిగ్రేషన్​ విభాగం తెలిపింది. కాగా, వీసా దరఖాస్తు కేంద్రాల్లో అప్లికేషన్​కు చెల్లించే సొమ్ముకు ఇది అదనం. ఇమ్మిగ్రేషన్​లో సిస్టమ్​ను అప్​గ్రేడ్​ చేసినందువల్ల దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని న్యూజిలాండ్​​ ఇమ్మిగ్రేషన్​ డిపార్ట్​మెంట్​ సూచించింది.

Read Also: గెలిపించకపోతే చనిపోతా : అనిరుధ్​ రెడ్డి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>