epaper
Friday, January 16, 2026
spot_img
epaper

మూడో టీ20 భారత్​దే

కలం, వెబ్​డెస్క్​: బౌలింగ్​, బ్యాటింగ్​లో సమష్టి ప్రదర్శనతో భారత్​ మూడో టీ20లో అద్బుత విజయం సాధించింది. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ ​(IND Vs SA ) లో ఆతిథ్య జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్​ ఓడి ముందుగా బ్యాటింగ్​కు దిగిన పర్యాటక జట్టు ఆరంభం నుంచే వికెట్లు చేజార్చుకుంది. చివరికి సరిగ్గా ఇన్నింగ్స్​ చివరి బంతికి 117 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. మార్​క్రమ్​(61; 46 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్​లు) టాప్​ స్కోరర్​. అర్షదీప్, హర్షిత్​, వరుణ్​ చక్రవర్తి, కుల్​దీప్​ తలో రెండు వికెట్లు తీశారు. శివం దూబే, హార్థిక్​ పాండ్యా చెరో వికెట్​ పడగొట్టారు.

అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​ ప్రారంభించిన భారత్​ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఎడాపెడా ఫోర్లు, సిక్స్​లతో విరుచుకుపడిన అభిషేక్​(35; 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్​లు) స్కోరు 60వద్ద తొలి వికెట్​గా వెనుదిరిగాడు. మార్​క్రమ్​ దాదాపు 24 మీటర్లు వెనక్కి పరుగెత్తి అద్భుతంగా క్యాచ్​ అందుకున్నాడు. ఆ తర్వాత ఆచితూచి ఆడిన గిల్​(28; 28 బంతుల్లో 5 ఫోర్లు) 90 పరుగుల వద్ద రెండో వికెట్​గా వెనుదిరిగాడు. పేలవ ఫామ్​లో ఉన్న కెప్టెన్​ సూర్యకుమార్​(12; 11 బంతుల్లో 2 ఫోర్లు) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఈ సమయంలో తిలక్​ వర్మ(25; 34 బంతుల్లో 3 ఫోర్లు)కు జత కలసిన శివం దూబే(10) వరుసగా సిక్స్​, ఫోర్​ బాదడంతో భారత్ మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ (IND Vs SA)లో విజయం అందుకుంది. అర్షదీప్​ సింగ్​ ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా ఎంపికయ్యాడు. భారత్​ సిరీస్​లో 2–1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత టీ20 ఈ నెల17న లక్నో వేదికగా జరుగుతుంది.

 Read Also:  లోడ్‌తో దిగితే బ్యాటరీ ఫుల్.. చైనా ట్రక్కులకు కొత్త టెక్నాలజీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>