epaper
Friday, January 16, 2026
spot_img
epaper

డీప్​ ఫేక్​ నియంత్రణకు బిల్లు

కలం, వెబ్​ డెస్క్​: ఈ టెక్నాలజీ యుగంలో ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి డీప్​ ఫేక్(Deepfake)​. మన ప్రమేయం లేకుండానే మన ఫొటోలు, వీడియోలను తమకు ఇష్టం వచ్చినట్లు మార్చి, సోషల్​ మీడియాలోనూ యూట్యూబ్​ లోనూ పోస్ట్​ చేయడం ఈ డీప్​ ఫేక్​ ముఖ్య లక్షణం. మన ప్రధానితోపాటు ఎంతో మంది రాజకీయ నాయకులు, సినిమా తారలు, బిజినెస్​ ప్రముఖులు ఈ డీప్​ ఫేక్​ బారిన పడ్డారు. సామాన్యులు సైతం దీని బాధితులే. అలాంటి ఈ డీప్​ ఫేక్​ ను నియంత్రించాలని కోరుతూ శనివారం లోక్​ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. శివసేన ఎంపీ శ్రీకాంత్​ శిందే(Shrikant Shinde) ఈ ప్రైవేట్​ మెంబర్​ బిల్లు ప్రవేశపెట్టారు. ‘మోసం, వేధింపులు, తప్పుడు సమాచారం కోసం డీప్​ ఫేక్(Deepfake)​ ను దుర్వినియోగం చేస్తున్నారు. దుర్బుద్ధితో ఇలాంటి కంటెంట్​ తయారుచేసినా, ఫార్వర్డ్​ చేసినా అలాంటి వాళ్లకు కఠిన పడాలి. దీనిపై విధివిధానాలతో అవసరమైన చట్టం రూపొందించాలి’ అని కేంద్రాన్ని బిల్లులో ఎంపీ కోరారు.

Read Also: మనది అత్యంత జాత్యాహంకార సమాజం: కర్ణాటక హైకోర్టు

Follow Us On : Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>