epaper
Thursday, March 5, 2026
epaper

అనూహ్యం.. బెంగాల్​ గవర్నర్​ రాజీనామా

కలం, వెబ్​ డెస్క్​: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పశ్చిమ బెంగాల్​లో అనూహ్య పరిణామం. ఆ రాష్ట్ర గవర్నర్​ సీవీ ఆనంద బోస్(CV Ananda Bose)​ రాజీనామా చేశారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచే ఆయన రిజైన్​ చేసినట్లు బెంగాల్​ లోక్​భవన్​ గురువారం వెల్లడించింది. తన రాజీనామా విషయాన్ని ఆనంద బోస్​ ధ్రువీకరించారు. అయితే, కారణాలు మాత్రం చెప్పలేదు. ఈ రోజు ఉదయమే ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపినట్లు సమాచారం.

మూడేన్నరేళ్ల కిందట పశ్చిమ బెంగాల్​ గవర్నర్​గా ఆనంద బోస్(CV Ananda Bose)​ బాధ్యతలు స్వీకరించారు. కేంద్రం, బెంగాల్​ సీఎం మధ్య ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితుల్లో నెట్టుకొచ్చారు. ఆయన రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కొత్త గవర్నర్​గా తమిళనాడు గవర్నర్​ ఆర్​ఎన్​ రవి రానున్నట్లు తనకు కేంద్ర హోంశాఖ ద్వారా తెలిసిందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!