కలం, వెబ్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతికి తీవ్ర సంతాపం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి గురువారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Vikram Misri) వెళ్లారు. ఇరాన్ రాయబారిని కలిశారు. ప్రభుత్వం తరఫున సంతాపం ప్రకటించారు. అనంతరం సంతాప సందేశాన్ని రాసి, సంతకం చేశారు.
కాగా, అణ్వాయుధాలు తయారుచేస్తోందంటూ ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా (Israel – US) సంయుక్త దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆదివారం మరణించారు. అయితే, ఆయన మృతిపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీనిపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని, ప్రధాని మోదీని ప్రశ్నించాయి. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు ప్రధాని మోదీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో ఖమేనీ మృతి చెందిన నాలుగు రోజుల తర్వాత తొలిసారి ఈ రోజు భారత్ స్పందించింది. ఆయన మృతికి విదేశాంగ కార్యదర్శి(Vikram Misri) ద్వారా తీవ్ర సంతాపం తెలిపింది.
Read Also: మరో మూడు దేశాలకు పాకిన యుద్ధం
Follow Us On: X(Twitter)

