కలం, వరంగల్ బ్యూరో: పోలీస్ ఇంటికే కన్నం పెట్టారు దొంగలు (Thieves). ఇంట్లో ఎవరు లేని సమయంలో డబ్బులు, వెండి దోచుకెళ్లారు. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో డోర్నకల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు పని నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇదే అవకాశంగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి రూ.40,000 నగదు, వెండి వస్తువులను దొంగలించారు. ఘటనా స్థలాన్ని సీఐ చంద్రమౌళి క్లూస్ టీంతో పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

