కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పులివెందుల (Pulivendula)లోని వేంపల్లె మండలం నందిపల్లిలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయ్యాక ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

