epaper
Sunday, March 1, 2026
epaper

ఇమ్రాన్​ ఖాన్​ ఇష్యూ.. దిగొచ్చిన పాక్​

కలం, వెబ్​ డెస్క్: పాక్​​ మాజీ ప్రధాని, పాకిస్థాన్​ తెహ్రీక్​ ఎ ఇన్సాఫ్​ ​(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)​ విషయంలో ఆ దేశ ప్రభుత్వం ఎట్టకేలకు ఓ మెట్టు దిగింది. అవినీతి కేసులో కొన్నేళ్లుగా జైలులో ఇమ్రాన్​ను పాక్​ ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు పాక్​ ప్రభుత్వం సరైన ట్రీట్మెంట్​ అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల కంటిచూపు మందగించిన విషయం బయటకొచ్చింది.

దీనిపై ఇమ్రాన్ కుటుంబసభ్యులు, పీటీఐ పార్టీ (PTI Party) నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అలాగే, ఇమ్రాన్​కు సరైన వైద్య చికిత్స అందించాలంటూ వివిధ దేశాల క్రికెట్​ దిగ్గజ ఆటగాళ్లు లేఖ రాశారు. పాకిస్థాన్​ క్రికెట్​ జట్టుకు ఎన్నో ఏళ్లు నాయకత్వం వహించడంతోపాటు ఆ దేశానికి వరల్డ్​ కప్​ అందించిన తమ సహచరునికి సరైన ట్రీట్మెంట్​ అందించాలని కోరారు. దీనికితోడు అంతర్జాతీయంగానూ పాక్​పై ఒత్తిడి పెరిగింది.

ఈ క్రమంలో మంగళవారం ఇమ్రాన్​ ఖాన్​(Imran Khan)ను వైద్య పరీక్షల నిమిత్తం పాకిస్థాన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(పీఐఎంఎస్​) ఆస్పత్రికి పాక్​ ప్రభుత్వం తరలించింది. ఆయన్ను డాక్టర్లు పరిశీలించి కంటి పరీక్షలు చేశారు. ఇంజక్షన్లు ఇచ్చారు. అనంతరం ఇమ్రాన్​ను పాక్​ సైనిక దళాలు తిరిగి జైలుకు తరలించాయి. అయితే, ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం గురించి మాత్రం జైలు సిబ్బంది, అధికారులు వెల్లడించలేదు.

Read Also: కేరళ స్టోరీ 2 వివాదం.. జాతీయ క్రీడాకారిణి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!